హైదరాబాద్ : క్రేన్ బకెట్ పడి ఇద్దరు రైతులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోగురువారం చోటు చేసుకుంది. మండలంలోని బల్లూనాయక్ తండాలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో క్రేన్ సహాయం పూడిక తీస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో మట్టితో నిండిన బకెట్పైకి వస్తుండగా ప్రమాదవశాత్తు క్రేన్ కూలిపోయింది. క్రేన్ బకెట్ రైతులపై పడింది. దీంతో బీమా, క్రాంతి అనే ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే వారిని హుస్నాబాద్ హాస్పిటల్కు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బావిలో పూడిక తీసేందుకు వెళ్లి ఇద్దరు రైతులు మృత్యువాతపడడంతో తండాలో విషాదం నెలకొంది.