లక్నో : ఉత్తర్ప్రదేశ్లో ఖరీదైన హోటల్లో సోషల్ మీడియా వేదికగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న హైటెక్ సెక్స్ రాకెట్ను పోలీసులు రట్టు చేశారు. నోయిడాలోని ఓ హోటల్లో చీకటి దందా నడుపుతున్న నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో హాటల్ యజమాని, చండీఘడ్కు చెందిన మహిళలు సహా ఆరుగురు వ్యక్తులున్నారు. ఘటనాస్ధలం నుంచి పోలీసులు వోక్స్వ్యాగన్ కారు, 12 మొబైల్ ఫోన్లు, రూ 37,600 నగదు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు సోషల్ మీడియా ద్వారా కస్టమర్లను ఆకర్షించి ఆపై వారికి మహిళలను సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ దందాలో నిర్వాహకులు కమిషన్ తీసుకుంటారని చెప్పారు. హోటల్లో రెండు ఫ్లోర్లను హైటెక్ వ్యభిచార దందాను నిర్వహించేందుకు కేటాయించారని తెలిపారు. శంకర్ కుమార్ అనే నిందితుడు తన వోక్స్వ్యాగన్ కార్లో పలు ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడని చెప్పారు.