జగిత్యాల : కరోనాతో రెండు రోజుల వ్యవధిలో అన్నదమ్ములిద్దరు మృతి చెందిన విషాద సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణంలోని పోచమ్మ వాడకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు జంగిలి రాజన్న, జంగిలి రవీందర్కు పది రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో కరీంనగర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి తమ్ముడు జంగిలి రవీందర్ మంగళవారం మృతి చెందాడు.
కుటుంబ సభ్యులు ఆ భాధ నుంచి కోలుకోకముందే గురువారం జంగిలి రాజన్న సైతం పరిస్థితి విషమించి మృతి చెందాడు. అన్నదమ్ములిద్దరు మృతి చెందడంతో ఆ రెండు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇవి కూడా చదవండి..
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు
కరోనా ఉధృతిపై వరంగల్లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం
ఇండియాకు ఆక్సిజన్ కోసం ఓవర్టైమ్ పని చేస్తున్నాం: చైనా