కావలసిన పదార్థాలు: వేపపువ్వు: అర కప్పు, ఎండుమిర్చి: నాలుగు, నిమ్మకాయ: ఒకటి, చింతపండు: కొద్దిగా, ఉప్పు: తగినంత, బెల్లం: చిన్న ముక్క, ధనియాలు: 2 టీ స్పూన్లు, మినుపపప్పు: 2 టీ స్పూన్లు, జీలకర్ర: ఒక టీ స్పూన్, నూనె: రెండు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం: నూనె వేడయ్యాక ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మినుపపప్పు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో వేపపువ్వు వేసి మూత పెట్టకుండా బాగా వేయించాలి. చల్లారాక, అన్నిటినీ మిక్సీజార్లో వేసి బెల్లం, నిమ్మరసం, చింతపండు రసం వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మరో గిన్నెను స్టవ్మీద పెట్టి, నూనె వేసి పోపు గింజలు, ఎండుమిర్చి, మినుపపప్పు వేసి చివరగా కాస్త ఇంగువ వేసిన పోపుని పచ్చడిలో కలుపుకుంటే సరి. ఆరోగ్యకరమైన వేపపువ్వు పచ్చడి రెడీ.