కావలసిన పదార్థాలు:
మినుములు: రెండు కప్పులు, కారం: ఒక టీ స్పూన్, మామిడికాయ పొడి: ఒక టీ స్పూన్, గరం మసాల: పావు టీ స్పూన్, వేయించిన జీలకర్ర పొడి: ఒక టీ స్పూన్, అల్లం: చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు: రెండు, కొత్తిమీర: కొద్దిగా, కొబ్బరి తురుము: ఒక టీ స్పూన్, ఉప్పు: రుచికి తగినంత, నూనె: సరిపడా.
తయారీ విధానం:
ముందుగా మినుములు రాత్రి నానపెట్టుకోవాలి. నానపెట్టిన మినుములలోంచి నీళ్లను తీసేసి అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కారం, మామిడికాయ పొడి, గరం మసాల, జీలకర్రపొడి, కొబ్బరి తురుము, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ కబాబ్లా చేసుకుంటూ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. సాస్ లేదా చట్నీతో వేడివేడిగా సర్వ్ చేయాలి.