కావలసిన పదార్థాలు
మైదాపిండి: ఒక కప్పు, ఉప్పు: తగినంత, నెయ్యి: పావు కప్పు, చక్కెర: ఒక కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ఒక గిన్నెలో మైదా, కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ గోరువెచ్చని నెయ్యి వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి అరగంటపాటు పక్కన పెట్టాలి. స్టవ్మీద పాన్పెట్టి చక్కెర వేసి అరగ్లాసు నీళ్లుపోసి తీగపాకం వచ్చేవరకు కలపాలి. పాకం వచ్చాక యాలకుల పొడి వేసి బాగా కలపాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పూరీలా ఒత్తి మధ్యలో నెయ్యి రాసి నాలుగు మడతలు వేసి మళ్లీ ఒత్తుకోవాలి. స్టవ్మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి, బాగా వేడయ్యాక.. అప్పటికే చేసి పెట్టుకున్న పూరీలను రెండువైపులా కాల్చి చక్కెరపాకంలో వేయాలి. ఒక నిమిషం చక్కెర పాకంలో నానిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకుంటే నోరూరించే పాకం పూరీలు సిద్ధం. మైదా ఇష్టపడని వాళ్లు గోధుమపిండితోనూ చేసుకోవచ్చు.