కావలసిన పదార్థాలు:
లేత మక్కజొన్న గింజలు: అర కప్పు, బియ్యం: రెండు కప్పులు, పచ్చిమిర్చి: నాలుగు, జీలకర్ర: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా బియ్యం కడిగి, తగినన్ని నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి. తర్వాత నానిన బియ్యం, లేత మక్కజొన్న గింజలు మెత్తగా రుబ్బుకుని సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు పెనం వేడయ్యాక, పలుచగా దోశలు వేసుకుని చుట్టూ కొద్దిగా నూనె వేసి కాల్చుకుంటే చాలు. కరకరలాడే కార్న్ దోశ రెడీ!