కావలసిన పదార్థాలు:
క్యాబేజీ తురుము: రెండు కప్పులు, బియ్యం: ఒక కప్పు, మినుపపప్పు: రెండు టేబుల్ స్పూన్లు, మెంతులు: ఒక టీ స్పూన్, ఎండుమిర్చి: నాలుగు, పచ్చికొబ్బరి తురుము: ఒక కప్పు, బెల్లం: పావు కప్పు, చింతపండు గుజ్జు: రెండు టేబుల్ స్పూన్లు, పసుపు: అర టీ స్పూన్, కొత్తిమీర తురుము: ఒక టీ స్పూన్, జీలకర్ర: అర టీ స్పూన్, ఉప్పు: తగినంత.
తయారీ విధానం:
ముందుగా బియ్యం, మినుపపప్పు, మెంతులు బాగా కడిగి అందులోనే ఎండుమిర్చికూడా వేసి ఐదు గంటలపాటు నానబెట్టాలి. నానిన ఎండుమిర్చి తీసి పక్కన పెట్టి బియ్యాన్ని మెత్తగా దోశపిండిలా రుబ్బుకొని ఓ రెండు గంటలపాటు నాననివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో నానిన ఎండుమిర్చి, కొబ్బరి, చింతపండు, బెల్లం, జీలకర్ర, పసుపు, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా నానిన దోశల పిండిలో క్యాబేజీ తురుము, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ప్యాన్మీద నూనె వేసి వేడయ్యాక దోశ వేసి, కొంచెం కాలిన తర్వాత పైనుంచి మసాలా మిశ్రమాన్ని ఒక పూతలా వేసి నూనెతో కాల్చుకుంటే వేడివేడి క్యాబేజీ దోశ రెడీ.