కావలసిన పదార్థాలు:
బియ్యం: రెండు కప్పులు, దంపుడు బియ్యం: ఒక కప్పు, అటుకులు: పావు కప్పు, కొబ్బరి తురుము: ఒకటిన్నర కప్పు, ఈస్ట్: అర టీ స్పూను, చక్కెర: రెండు టీ స్పూన్లు, ఉప్పు, నూనె, నీళ్లు: సరిపడా.
తయారీ విధానం:
రెండు రకాల బియ్యాలను బాగా కడిగి అయిదు గంటలు నానబెట్టుకోవాలి. బాగా నానిన బియ్యాన్ని మిక్సీలో వేసి ఓ మోస్తరుగా మెదిగాక అటుకులు, కొబ్బరి తురుము, ఈస్ట్కూడా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఉప్పు, చక్కెర కలిపి పిండిని వెడల్పాటి గిన్నెలో పోసి మూడు గంటలపాటు నానబెట్టాలి. చిక్కబడిన పిండికి కాస్త నీటిని చేర్చి కావలసినమేర జారుగా చేసుకోవాలి. కడాయి లేదా ఆపం ప్యాన్లో కాస్త నూనె వేసి, గరిటెతో పిండిని వేసి మూత పెట్టి దోశలా కాల్చితే మెత్తమెత్తని ఆపం సిద్ధం.