పూర్ణ, తేజ త్రిపురాన నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘బ్యాక్డోర్’. కర్రి బాలాజీ దర్శకుడు. బి. శ్రీనివాసరెడ్డి నిర్మాత. ఈ చిత్రంలోని ‘యుగాల భారత స్త్రీని’ అనే గీతాన్ని వై.ఎస్. షర్మిల ఇటీవల విడుదలచేశారు. ఈ గీతానికి జావళి సాహిత్యాన్ని అందించారు. ప్రణవ్ స్వరకర్త. ఈ సందర్భంగా సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని షర్మిల ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సందేశం మిళితమైన కుటుంబ కథా చిత్రమిది. తనకంటే తక్కువ వయసున్న కుర్రాడితో ప్రేమలో పడిన ఓ మహిళ కథ ఇది. వారి బంధం ఎలాంటి పరిణామాలకు దారితీసిందన్నది ఆకట్టుకుంటుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు.