లండన్ : పెరుగుతున్న కొవిడ్-19 కేసుల మధ్య బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను కుదించుకున్నారు. బోరిస్ జాన్సన్ ఈ నెలాఖరులో భారత పర్యటనకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపుతుండటంతో పలు దేశాల్లో లాక్డౌన్లు విధిస్తున్నారు. వ్యాక్సిన్లు ఇవ్వడం ముమ్మరంగా సాగుతున్నప్పటికీ కొవిడ్-19 వేగంగా వ్యాప్తిచెందుతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఏప్రిల్ నెలాఖరులో భారత పర్యటనకు వస్తున్న బోరిస్ జాన్సన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. పర్యటన యొక్క సవరించిన వ్యవధి, షెడ్యూల్, ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
అంతకుముందు, ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్లో బోరిస్ జానసన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని భావించారు. అయితే, బ్రిటన్లో కొవిడ్-19 పరిస్థితులు తీవ్రంగా పెరుగుతున్న ఆందోళనల దృష్ట్యా ఈ పర్యటన వాయిదా పడింది. ప్రస్తుత పర్యటనలో రక్షణ, భద్రతా ఒప్పందాలు, చైనా, కొవిడ్-19 వ్యాక్సిన్ తదితరాలపై ఇరుదేశాల మధ్య చర్చలు జరుగనున్నట్లు సమాచారం.
తమ దేశ ప్రధాని జనవరిలో రావాలని అనుకోగా.. కొవిడ్ పరిస్థితి విషమించడంతో తన పర్యటనను రద్దు చేసుకున్నారని ఢిల్లీలోని బ్రిటిష్ హకమిషనర్ అలెక్స్ ఎల్లీస్ తెలిపారు.ఇప్పుడు అతను రావడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎదురుచూస్తున్నారు అని చెప్పారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమించిన తరువాత బ్రిటన్ ప్రధానమంత్రి చేస్తున్న మొదటి పర్యటన ఇదే.
చంద్రుడిపై రోవర్ను పంపేందుకు జపాన్తో జతకట్టిన అరబ్ ఎమిరేట్స్
ఎవర్ గివెన్ను స్వాధీనం చేసుకోండి : ఈజిప్ట్ కోర్టు
జూన్ 1 నుంచి హాల్మార్క్ నగలే అమ్మాలి..
సొంత ప్రజలపైనే కెమికల్ అటాక్.. సిరియా దుర్మార్గాన్ని బయటపెట్టిన నివేదిక
కుట్టుపిండి ఆహారాలు తిన్న 500 మందికి అస్వస్థత
సీబీఐ ఎదుట హాజరైన అనిల్ దేశ్ముఖ్
మహా దార్శనికుడు భీంరావ్ అంబేడ్కర్ : చరిత్రలో ఈరోజు
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..