ముంబై : మనీల్యాండరింగ్ కేసులో వచ్చే వారం తమ ఎదుట హాజరు కావాలని బాలీవుడ్ నటి యామీ గౌతమ్కు ఎన్ఫోర్స్మెంట్ ఢైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. యామీ బ్యాంక్ అకౌంట్లో ఫెమా చట్టం కింద అవకతవకలు గుర్తించిన మీదట ఈ వ్యవహారంపై ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకు విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. యామీ ఖాతాలో రూ 1.5 కోట్ల వరకూ విదేశీ ద్రవ్య లావాదేవీలను ఈడీ గుర్తించినట్టు సమాచారం.
బాలీవుడ్ నటి యామీ గౌతమ్కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది రెండవసారి. ఈడీ సమన్లపై బాలీవుడ్ నటి ఇప్పటివరకూ స్పందించలేదు. యూరి డైరెక్టర్ ఆదిత్య ధార్తో పెండ్లికి సంబంధించి యామీ ఇటీవల వార్తల్లో నిలిచారు. గుట్టుచప్పుడు కాకుండా పెండ్లి చేసుకున్న ఈ జంట ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు. యామీ 2012లో విక్కీ డోనర్ మూవీతో బాలీవుడ్లో విజయవంతంగా తన కెరీర్ ప్రారంభించారు. ఆపై బద్లాపూర్, కాబిల్, యూరి వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.