చార్మినార్, జూలై 9: కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ఆదివారం నుంచి జూ పార్క్ను సందర్శకులు తిలకించడానికి పునః ప్రారంభం కానుందని జూ పార్క్ క్యూరేటర్ సుభద్రాదేవి తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జూ పార్క్ను సందర్శించడానికి జాతీయ జూ అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సందర్శకులకు ప్రవేశాలు కల్పిస్తున్నామని తెలిపారు. జూలోని ఎన్క్లోజర్లతో పాటు జంతువులను తిలకించడానికి గతంలో సందర్శకులకు అందించిన అన్ని సౌకర్యాలను తిరిగి అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. బ్యాటరీ వాహనాలతో పాటు ఇతర వాహనాలను సైతం సందర్శకులకు అందుబాటులోఉంటాయని తెలిపారు. జూను సందర్శించే పర్యాటకులు కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ సామాజిక దూరం పాటించాలని జూ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను అనుసరిస్తూ 10 ఏళ్లలోపు చిన్నారులతో పాటు 65 ఏళ్ల పైబడిన వారికి జూలో ప్రదేశాలను నిలిపి వేస్తున్నామని జూ అధికారులు తెలిపారు.