బాండ్ సిరీస్ లో 25వ చిత్రం నో టైమ్ టూ డై ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మహమ్మారీ దెబ్బకు అంతకంతకు వెనక్కి వెళ్లిపోతోంది. ఇటీవలే ఏప్రిల్ 2021 వరకు వాయిదా పడిందని కథనాలొచ్చాయి. ఓటీటీలోకి వెళుతుందని కొందరు అన్నారు. అక్టోబర్ 8న ఎట్టకేలకు అమెరికాలో ఈ చిత్రం విడుదలవుతోంది. మన దేశంలో సెప్టెంబర్ 30న గ్రాండ్గా రిలీజ్ కానుంది.
నో టైమ్ టు డై నిర్మాణానికి బడ్జెట్ $ 250 మిలియన్లు ఖర్చయ్యింది. బాండ్ సిరీస్ చివరి సినిమా నో టైమ్ టు డై ని అమెరికా- బ్రిటన్ లలో థియేటర్లలో విడుదల చేస్తుండడం ఆసక్తికరం. అయితే ఈ చిత్రంతోనే జర్మనీలోని లియోన్ బర్గ్ లోని ట్రామాప్లాస్ట్ మల్టీప్లెక్స్ లాంచింగ్ కానుంది. 70 అడుగుల ఎత్తు .. 125 అడుగుల వెడల్పుతో సెట్ చేయబడిన అతి భారీ స్క్రీన్ అని, ప్రపంచంలోని అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ ఇదే అని అంటున్నారు.
జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ నో టైమ్ టూ డై రిలీజ్ తో జర్మనీ ఐమ్యాక్స్ ని లాంచ్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జేమ్స్ బాండ్ పాత్రలో డేనియల్ క్రెయిగ్ నటిస్తున్నారు. ఇదే అతడికి ఫ్రాంఛైజీలో చివరి అవకాశం అని తెలిసింది.