కేపీహెచ్బీ కాలనీ, మార్చి 10 : అధికారంలోకి వచ్చిన కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాభివృద్ధికి చేసిందేమీ లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి గెలుపు కోసం కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ కాలనీ డివిజన్ వసంతనగర్లో విద్యావంతులతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మంద డి శ్రీనివాస్ రావు లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి నిధులను కేటాయించడంలో వివక్షత చూపుతుందని కేవలం దక్షిణాది రాష్ర్టాలకు మాత్రమే నిధులు కేటాయి స్తుందన్నారు. ఎన్నికలు రాగానే ప్రజల్లో విద్వేశాలను రెచ్చగొట్టి లబ్ధిపొందడం తప్పా ప్రజలకు చేసిందేమీలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. విజ్ఞానవంతులు ఆలోచించి వాణీదేవిని బలపర్చాలని మొదటి ప్రాధాన్యతగా ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మందలపు సాయిబాబా చౌదరి, ఇన్చార్జి అడుసుమల్లి వెంకటేశ్వర్రావు, శ్యామలరాజు, శివారెడ్డి, ఎర్ర నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన సురభివాణీదేవి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లతో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఏనాడూ ప్రజా సమస్యలను పరిష్కరించడం లో ముందుకు రాలేదన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి మచ్చలేని రాజకీయ కుటుంబం నుంచి వచ్చారని, విద్యావంతురాలైన ఆమెను గెలిపిస్తే పట్టభద్రులకు మేలు జరుగుతుందని ఓటర్లు విశ్వసిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, జూపల్లి సత్యనారాయణ, ఆవుల రవీందర్రెడ్డి, ముద్దం నర్సింహయాదవ్, పండాల సతీశ్గౌడ్, సబీహాగౌసుద్దీన్, మాజీ కార్పొరేటర్లు తూము శ్రావణ్కుమార్, పగడాల బాబూరావులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి గెలుపు కోసం కేపీహెచ్బీ కాలనీ బాలాజీనగర్ టీఆర్ఎస్ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. కేపీహెచ్బీ కాలనీ 5వ ఫేజ్లో టీఆర్ఎస్ నాయకులు కట్టా నర్సింగరావు, పిడికిటి గోపాల్ చౌదరిలు, కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్లో బత్తుల హరిబాబు, ప్రతాప్, వెంకటరమణ, కాలనీ 4వ ఫేజ్లో రాజేశ్, మస్తాన్, వసంతనగర్ కాలనీలో రాణాప్రతాప్, సుంకర సునీల్, బాలాజీనగర్ డివిజన్లో పవన్కుమార్, వంశీ, ఆరోగ్యరెడ్డి, వెంకటేశ్ చౌదరి, రమణ ప్రచారం చేస్తున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటేయాలని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహాబేగం కోరారు. ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను పంచుతూ వా ణీదేవికి ఓటేయాలని కోరుతున్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లింగాల ఐల య్య, కో-ఆర్డినేటర్ వీరారెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన వాణీదేవికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) రాష్ట్ర కార్యదర్శి కల్వ శ్రవణ్కుమార్ అన్నారు. బుధవారం టీఎస్సీపీఎస్ఈయూ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన వాణీదేవికి ఓటేయాలని తీర్మాణించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి ఎంఏ. రావూఫ్ పాల్గొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు పల్లా రాజేశ్వర్రెడ్డి, సురభివాణీదేవిలకు జేఎన్టీయూహెచ్ విద్యార్థి జేఏసీ, కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల నేతలు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. బుధవారం నగరంలోని జేఎన్టీయూహెచ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులతో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమావేశానికి వర్సిటీ విద్యార్థి, ఉద్యోగ సం ఘాల నేతలు తరలివెళ్లారు. కార్యక్రమంలో రంజిత్కుమా ర్, శివారెడ్డి, మహేందర్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, శ్రీను నాయక్, రాజ్కుమార్, వంశీకృష్ణ, నవీన్, మెగారాజు, వేణు, కిషో ర్, రామచంద్ర, అజయ్, రవి, బాలకృష్ణ ఉన్నారు.
కూకట్పల్లి : ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి సురభివాణీదేవి గెలుపును కాంక్షిస్తూ బ్రాహ్మణ సంఘాల సమాఖ్య ప్రతినిధులతో బుధవారం రాష్ట్ర బ్రాహ్మణ శ్రీవైష్ణవి సేవా సమితి అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ కాండూరి నరేంద్రచార్య సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయ లని సూచించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల సమాఖ్య ప్రతినిధులు, గిరిధర్ శర్మ, పంచ గంగేశ్వర్, రమణ, శైలజ, సాయి, రామశర్మ పాల్గొన్నారు.
మియాపూర్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా వివేకానందనగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవిరంగారావు, హైదర్నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్గౌడ్లు వారి డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ముమ్మరంగా చేపట్టారు. ఈ సందర్భంగా తమ డివిజన్ల పరిధిలో కార్పొరేటర్లు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టి వాణీదేవికి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, సంజీవరెడ్డి, కృష్ణముదిరాజ్, పోతుల రాజేందర్, వెంకటేశ్యాదవ్ పాల్గొన్నారు.
బాలానగర్ : పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి సురభివాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూకట్పల్లి నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఎజాజ్ అన్నారు. బుధవారం ఆయన మాజీ కౌన్సెలర్ లావణ్యతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని కోరారు.