వైభవంగా మల్లికార్జునస్వామి కల్యాణం
హాజరైన జడ్పీ, మున్సిపల్ చైర్పర్సన్లు అరుణ, కళ
సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 5: పెద్దూరు, బోనాలలోని శ్రీ కృష్ణ యాదవ సంఘాల ఆధ్వర్యంలో పెద్దూరు శివారులోని ఎద్దు గుట్టపై వెలిసిన శ్రీ మల్లికార్జునస్వామి కల్యాణోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి పుట్ట బంగారం తీసుకువచ్చి, సోమవారం నాగవెళ్లి పట్నం వేసి కల్యాణోత్సవాన్ని జరిపించారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తలకు ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నదానం చేశారు. జడ్పీ, మున్సిపల్ చైర్పర్సన్లు న్యాలకొండ అరుణ, జిందం కళ, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, బీసీ సెల్ జిల్లా నేత బొల్లి రామ్మోహన్, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్లు సత్యనారాయణ, రెడ్యానాయక్, ఎరవెల్లి వెంకటరమణారావు, గండ్ర రమేశ్రావు, జూపల్లి శ్రీనాథరావు, దార్ల సందీప్, గడ్డం లత, భాస్కర్, దార్ల అరుణ, తిరుపతినాయక్, జీల కిషన్, మెడుదుల దేవయ్య ప్రత్యేక పూజలు చేశారు. జాతర మహోత్సవ కమిటీ సభ్యులు, యాదవ సంఘం నాయకులు వీరిని సన్మానించారు.
ఇవి కూడా చదవండి..
విజయ్ దేవరకొండ కోసం పద్ధతులు మార్చుకున్న పూరీ జగన్నాథ్..
మూడు రాష్ట్రాలో భూకంపనలు.. రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రత