వెంకీ, వర్ష విశ్వనాథ్, చాందిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అందమైన లోకం’. రవీంద్రనాయుడు నిర్మాత. మోహన్ మర్రిపెల్లి దర్శకుడు. శుక్రవారం హైదరాబాద్లో ఈ చిత్రం ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘అందమైన ప్రేమకథా చిత్రమిది. ప్రేమలో ఉన్న వారితో పాటు లవ్ ఫెయిల్యూర్స్కు ఈ సినిమా నచ్చుతుంది. ఊహకందని మలుపులతో పాటు అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది’ అని తెలిపారు. లవ్ కామెడీ ఎంటైర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్.