బొల్లారం, మే 23 : రిహాబిలిటేషన్ సెంటర్లో ఓ వృద్ధుడు దారుణహత్యకు గురైన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రావణ్కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. తిరుమలగిరిలోని ఆశా ఆఫీసర్స్ కాలనీలో కొన్నేండ్లుగా సెర్నిటీ రిహాబిలిటేషన్ సెంటర్ కొనసాగుతుంది. ఇందులో మల్కాజిగిరికి చెందిన బీకేఆర్ శర్మ(61)తో పాటు మూసాపేటకు చెందిన మహేశ్, ముషీరాబాద్కు చెందిన ఉదయ్, చాంద్రాయణగుట్టకు చెందిన అబ్రహార్, బోయిన్పల్లికి చెందిన సుదీప్ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీకేఆర్ శర్మకు మిగతా నలుగురికి ఈనెల 15న ఉదయం టీ తాగే సమయంలో గొడవ జరగడంతో కోపోద్రికులైన నలుగురు కిటికీ అద్దం చువ్వతో శర్మ గొంతు కోశారు. శర్మ చికిత్స పొందుతూ అదేరోజు మధ్యాహం మృతి చెందాడు. పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.