ప్రవీణ్రెడ్డి, సరోజ్, హిమాన్షి, కావ్యాసురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సూర్యాస్తమయం’. బండి సరోజ్ దర్శకత్వంలో క్రాంతికుమార్ తోట నిర్మిస్తున్నారు. గురువారం ప్రీరిలీజ్ వేడుక జరిగింది. నిర్మాత మాట్లాడుతూ ‘పదేళ్ల తర్వాత నిర్మాతగా చేస్తున్న చిత్రమిది. స్నేహబంధం గొప్పతనాన్ని తెలియజెప్పే కథాంశంతో తెరకెక్కించాం. ఇందులో సీనియర్ దర్శకుడు వంశీగారు నటించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం, పాటలు, స్టంట్స్, ఎడిటింగ్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: బండి సరోజ్.