చొప్పదండి, మే 22: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని ఎంపీపీ చిలుక రవీందర్ నిర్వాహకులకు సూచించారు. మండలంలోని కోనేరుపల్లిలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో కల్పిస్తున్న సౌకర్యాలు, కొనుగోళ్ల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యం వెంటవెంటనే కొనుగోలు చేసి, రైస్మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఆయన వెంట సర్పంచ్ కోలపూరి తులసమ్మ, పంచాయతీ కార్యదర్శి ఉమారాణి, కొనుగోలు కేంద్రం నిర్వాహకురాలు నీలిమ, ఇన్చార్జి పరశురాం, కారోబార్ కోలపూరి రాజనర్సు, రైతులు తదితరులున్నారు. అలాగే, కొలిమికుంట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ తాళ్లపల్లి సుజాత, ఏఈవో అనిల్ రెడ్డితో కలిసి పరిశీలించారు. కొనుగోళ్లలో వేగం పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్తు తిరుపతి, ఐకేపీ సీఏలు తాళ్లపల్లి గంగ, మల్యాల సునీత, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, రేగుల శ్రీనివాస్, సత్తు శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.