సంగారెడ్డి : తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి తనకు పూర్తి సహకారం లభిస్తుందని వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీని వీడే ఆలోచన ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. తానంటే గిట్టని వారు, కొన్ని మీడియా చానళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అసత్య ప్రచారం చేస్తున్న చానళ్లు, వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి
జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి
రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు