‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో కాకుండా తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా మంచి కథలను అందిస్తూ పాన్ ఇండియా రైటర్ గా మారిపోయారు విజయేంద్ర ప్రసాద్. ‘శ్రీకృష్ణ 2006’ ‘రాజన్న’ ‘శ్రీవల్లి’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన.. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైటర్ గా కొనసాగుతున్నారు.
విజయేంద్ర ప్రసాద్ తాజాగా అలీతో కలిసి పలు విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో అలీ ‘తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి కాకుండా మీకు నచ్చిన డైరక్టర్ ఎవరు?’ అని ప్రశ్నించారు. దీనికి విజయేంద్ర ప్రసాద్… పూరీ జగన్నాథ్ అని చెప్పారు. పూరీ అంటే నాకు అసూయ. నా శత్రువును ప్రతిరోజూ చూడాలని ఆయన ఫొటో నా ఫోన్ లో వాల్ పేపర్ గా పెట్టుకున్నాను” అని నవ్వుతూ చెప్పారు విజయేంద్ర ప్రసాద్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పని చేస్తున్న ఈయన సినిమా అభిమానలు అంచనాలను మించేలా ఉంటుందని చెప్పుకొచ్చారు.