మహేష్ బాబు, త్రివిక్రమ్ దాదాపు 11 ఏళ్ళ తర్వాత మళ్లీ కలిసి పని చేస్తున్నారు. దాంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే అతడు, ఖలేజా లాంటి క్లాసిక్స్ వచ్చాయి. ఇవి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు విజయం సాధించాయి అనేది పక్కన పెడితే.. తెలుగు సినిమా ఉన్నంత వరకు గుర్తుండిపోయే రెండు అరుదైన సినిమాలు ఇవి. అందుకే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ మీద అంచనాలు అలా ఉంటాయి. ఖలేజా సినిమా తర్వాత ఇద్దరి మధ్య ఏదో చిన్న గొడవ జరిగిందని మనస్పర్థలు వచ్చాయని.. అందుకే కలిసి పని చేయడం లేదు అంటూ వార్తలు చాలా వరకు వచ్చాయి.
మధ్యలో ఎలాంటి సినిమాలు కూడా రాకపోవడంతో అభిమానులు కూడా ఇది నిజమే అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ ఇద్దరు కలిసి పని చేస్తుండటంతో సంతోషంలో మునిగిపోయారు. అయితే ఈ కాంబినేషన్ కలవడానికి తెరవెనక రాయబారం ఒకరు సాగించారు. ఆ రాయబారి ఎవరో కాదు మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్. ఈ రోజు మహేష్ కెరీర్ ఈ స్థాయిలో ఉందంటే కారణం నమ్రత. సూపర్ స్టార్ కెరీర్ దగ్గరుండి చూసుకుంటుంది ఆయన భార్య.
ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది.. ఎవరితో కాంబినేషన్ చేస్తే బాగుంటుందనే విషయంలో నమ్రత ఆరితేరిపోయింది. అందుకే అసాధ్యం అనుకున్న ప్రాజెక్టులు కూడా ఆమె అప్పుడప్పుడు సెట్ చేస్తుంది. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కూడా అలాంటిదే. ఇద్దరు కలిసి పని చేయడం జరగదు అనుకుంటున్న తరుణంలో మళ్లీ కలిసి చేస్తున్నారు అంటే దానికి కారణం నమ్రత. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం.. దూరంగా ఉండడంతో సినిమా చేయరేమో అనుకుంటున్న సమయంలో.. చాలా తెలివిగా త్రివిక్రమ్ తో యాడ్స్ చేయించింది. దాంతో ఇద్దరి మధ్య మళ్లీ సఖ్యత పెరిగింది. ఆ సాన్నిహిత్యంతోనే మళ్లీ ఇప్పుడు సినిమా చేస్తున్నారు. అలా కలవదు అనుకున్న కాంబినేషన్ కలవడానికి నమ్రత రాయబారం చాలా పని చేసింది.
ఇవి కూడా చదవండి..
షూటింగ్ కొనసాగిస్తున్న నాని..!
ప్రభాస్తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
దిశాపటానీతో కిస్ సీన్పై సల్మాన్ ఏమన్నాడంటే..?
సరికొత్త టైటిల్తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో