వీల్ చైర్లో కపిల్ శర్మ.. త్వరగా కోలుకోవాలంటూ ప్రార్ధనలు

బాలీవుడ్ కమెడీయన్ కపిల్ శర్మ ముంబై ఎయిర్ పోర్ట్లో వీల్ చైర్లో కూర్చొని కనిపించి షాక్ ఇచ్చాడు. వీల్ చైర్లో కూర్చున్న అతనిని వేరొక వ్యక్తి తీసుకెళుతుండగా ఫొటోగ్రాఫర్స్ క్లిక్మనిపించారు. ప్రస్తుతం అతని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే కపిల్ శర్మకు ఏమైందనే విషయంపై క్లారిటీ లేదు.
2018లో హిందూ, సిక్కు సంప్రదాయంలో గిన్ని చరాత్ను వివాహం చేసుకున్న కపిల్ శర్మ 2019 డిసెంబర్లో కూతురు అనైరా శర్మకు జన్మనిచ్చారు, ఫిబ్రవరి 1,2021న తమకు పండంటి మగబిడ్డ జన్మించారని తెలియజేశారు. కామెడీ నైట్స్ విత్ కపిల్’ షోతో ప్రాచుర్యం పొందిన కపిల్ శర్మ.. హిందీ బుల్లితెరపై స్టార్ కమెడియన్గా ఎదిగిన సంగతి తెలిసిందే. అంతేగాక.. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించాడు.సన్ ఆఫ్ మంజీత్ సింగ్’ అనే సినిమాతో నిర్మాతగా కూడా మారాడు.
తాజావార్తలు
- నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. వెయ్యి పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- దీపిక పదుకొణే బ్యాగ్ దొంగిలించే ప్రయత్నం..!
- బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ వెలిగిస్తే రూ. 1000 జరిమానా
- అమెరికా వైమానిక దాడిలో 17 మంది మిలిటెంట్లు మృతి
- దేశంలో కొత్తగా 16,577 కొవిడ్ కేసులు
- బన్నీ సినిమాను రిజెక్ట్ చేసిన ప్రియా ప్రకాశ్.. !
- 100 జిలటిన్ స్టిక్స్.. 350 డిటోనేటర్లు స్వాధీనం
- ప్రముఖ తెలుగు రచయిత్రి పెయ్యేటి దేవి ఇకలేరు
- మార్చి 4 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఐదో దశ పరీక్షలు
- నేడు ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ స్నాతకోత్సవం.. ప్రసంగించనున్న ప్రధాని