పరుచూరి రవి, నరేష్ మేడి, ఆదర్శ్, పెద్దిరాజు ప్రతీక్ష, అనితభట్ నటీనటులుగా రూపొందుతున్న చిత్రం ‘కృష్ణలంక’. కార్తికేయ దర్శకుడు.పూనా సోహ్లా, చేతన్ నిర్మాతలు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన పూనాసోహ్లా పుట్టినరోజు పురస్కరించుకుని మంగళవారం ‘కృష్ణలంక’ చిత్రం పరిచయ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘ఎమోషనల్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రేమ, స్నేహం, పగ ఇలా అన్ని భావోద్వేగాలు వుంటాయి. పరుచూరి వెంకటేశ్వరరావు తనయుడు పరుచూరి రవి పాత్ర చిత్రానికి హైలైట్గా వుంటుంది’ అన్నారు.