కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘గుడ్లక్ సఖి’. నగేష్ కుకునూర్ దర్శకుడు. దిల్రాజు సమర్పణలో సుధీర్చంద్ర పదిరి, శ్రావ్యవర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీలో విడుదలకాబోతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లను చిత్రబృందం ఖండించింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఓటీటీలో సినిమా విడుదలకానుందని వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవం. పుకార్లను వ్యాప్తి చేయొద్దు. సినిమాకు సంబంధించిన అప్డేట్లను మేమే స్వయంగా వెల్లడిస్తాం. పల్లెటూరి నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టి షూటింగ్ క్రీడలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగిన ఓ యువతి కథ ఇది’ అని తెలిపారు. జూన్ 3న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావించినా లాక్డౌన్ కారణంగా వాయిదాపడింది. జగపతిబాబు ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ:
చిరంతన్ దాస్.