రఘునాథపాలెం, ఏప్రిల్ 7 : అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా టాస్క్ఫోర్స్, పోలీసులు రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెం వద్ద కాపుకాసి పట్టుకున్నారు. ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకట్రెడ్డి తెలిపిన ప్రకారం..ఖమ్మం జిల్లా పెదగూడూరుకు చెందిన బోడా వాలి, సారపాకకు చెందిన కొండపల్లి రవితేజ, బొజ్జా వంశీ డొంకరాయి నుంచి టీఎస్ 07యూబీ 4483నెంబరు గల కారులో హైదరాబాద్కు తరలిస్తున్నారు. దీనిపై అందిన సమాచారం మేరకు టాస్కఫోర్స్, రఘునాథపాలెం పోలీసులు వీ వెంకటాయపాలెం వద్ద వైరారోడ్డుపై అడ్డగించి పట్టుకున్నారు. పట్టుబడిన వాహనంలో 97ప్యాకెట్లలో 195కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు.
పట్టుబడిన గంజాయి విలువ రూ.30లక్షలుగా ఉంటుందని ఏసీపీ తెలిపారు. భూక్య కుమార్, గోళ్ల బానుప్రసాద్ కారుకు ముందు ద్విచక్ర వాహనంపై వెళ్తూ కారుకు పైలెట్గా ఉండి గంజాయి పట్టుబడిన విషయం తెలిసి పరారైనట్లు తెలిపారు. గంజాయిని స్వాధీన పర్చుకొని పట్టుబడిన ముగ్గురిని రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. గంజాయిని పట్టుకున్న వారిలో రఘునాథపాలెం ఎస్సై వరాల శ్రీనివాస్, టాస్క్ఫోర్స్ పోలీసులు ఉన్నారు.