అందుబాటులోకి కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు
ప్రభుత్వ దవాఖానల్లో వెంటిలేటర్లు
ఎంజీఎంలో 1100 ఆక్సిజన్ పడకలు
ప్రాణాలు నిలుపుతున్న డయాలసిస్
వరంగల్ ఉమ్మడి జిల్లాలో నాలుగు కేంద్రాలు
వరంగల్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆర్యోగ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వినూ త్న కార్యక్రమాలను చేపట్టింది. పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు అందిస్తున్నది. కరోనా సమయంలో ఎవరూ ఇబ్బంది పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసిం ది. కరోనా సోకి శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఆధునిక యంత్ర పరికరాలతో కృత్రిమ శ్వాస అందించి ప్రాణాపాయం నుంచి కాపాడుతున్నది. ఇందుకోసం ఎంజీఎం దవాఖానలో 130 వెంటిలేటర్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా సేవలకు 110 వెంటిలేటర్లు, మిగిలిన వాటిని సాధారణ వైద్యసేవలకు వినియోగిస్తున్నారు. వీటికి తోడు శరీర అసవరాలకు తగిన విధంగా 15 హైఫ్లో నాసల్ కాన్యులా యంత్ర పరికరాలను కేటాయించింది. వాటి సహాయంతో రోగికి చాలా సులువుగా ఆక్సిజన్ అందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా విభాగంలో వీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఎంజీఎంలో రెండు ఆక్సిజన్ స్టోర్ పాయింట్ల ద్వారా 1100 పడకలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. రెండు స్టోర్ పాయింట్లలో 10 వేల లీటర్ల సామర్థ్యంతో ఉన్న పాత యూనిట్ బాగా పని చేస్తున్నది. గత అక్టోబర్లో కొత్తగా 13వేల లీటర్ల సామర్థ్యంతో ఆక్సిజన్ స్టోర్ పాయింట్ను ఏర్పాటు చేశారు. కాకతీయ మెడికల్ కాలేజీలో కొత్తగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆక్సిజన్ స్టోర్ పాయింట్ను నిర్మించారు.
అందుబాటులోకి డయాలసిస్..
మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వారికి డయాలసిస్ సేవలు గతంలో హైదరాబాద్లోనే అందేవి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు అందుతున్నాయి. ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు రెవెన్యూ డివిజన్ స్థాయి పట్టణాల్లోనూ ప్రభుత్వం ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నది. ఒకప్పుడు కార్పొరేట్ దవాఖానల్లో మాత్రమే అందే ఈ వైద్య సేవలు ఇప్పుడు రాష్ట్రంలో పేదవారికి ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంజీఎం, జనగామ, నర్సంపేట, మహబూబాబాద్ ప్రభుత్వ దవాఖానల్లో డయాలసిస్ సేవలు అందుతున్నాయి. ములుగు జిల్లాలో సైతం డయాలసిస్ సెంటర్ను ప్రారంభించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. వరంగల్ ఎంజీఎంలో కోటి రూపాయలతో 14 ఆధునిక యంత్రాలతో రెండు (సాధారణ, వైరస్) విభాగాలుగా డయాలసిస్ సేవలు అందుతున్నాయి. ఒక్కో రోగికి నాలుగు గంటల చొప్పున రోజుకు 65 మందికి డయాలసిస్ చేస్తున్నారు.
జనగామ, నర్సంపేట, మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ.2 కోట్లతో డయాలసిస్ సెంటర్ల ను ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్లో ఐదు చొప్పున యంత్రాలు ఉన్నాయి. ఒక్కో సెంటర్లో ప్రతి నెలా 600 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయాలసిస్ చేసే సమయంలో మనిషి శరీరంలోని రక్తాన్ని పైపుల ద్వారా యంత్రానికి అనుసంధానం చేసి మూత్రపిండాలు చేయాల్సిన పనిని యంత్రంతో పూర్తి చేసి రక్తంలోని మలినాలను తొలగిస్తారు. ఒక్కసారి డయాలసిస్ చేసుకోవడానికి రూ.5 వేల వరకు ఖర్చవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నది. దేశంలో మరెక్కడాలేని విధంగా డయాలసిస్ యంత్రానికి అమర్చే ఫిల్టర్ల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం సింగిల్ యూజ్ విధానా న్ని అవలంబిస్తున్నది. రక్తం ద్వారా ఒకరి వ్యాధులు మరొకరికి సోకుండా ఇది బాగా ఉపయోగపడుతుంది. డయాలసిస్కు ముందే రక్తాన్ని శుద్ధి చేసే డయాలైజర్, బ్లడ్ ట్యూ బింగ్, ఏవీ ఫిస్టులా, ప్రొటెక్టర్లను ఒక్కో వ్యక్తికి ఒకటి చొప్పున వేర్వురుగా వినియోగిస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లలోనూ ఇప్పుడు ఇదే పద్ధతిని అమలు చేస్తున్నారు.