సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అకౌంట్స్ లేని వారు కూడా కొత్త అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మరీ అభిమానులకు దగ్గరవుతున్నారు. కాని ఆమీర్ ఖాన్, ఛార్మి లాంటి వారు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నామని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఇప్పుడు సల్మాన్ నటించిన దబాంగ్ 3 చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన వరీనా హుస్సేన్ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది.
కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకు నేను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఫ్యాన్స్ ప్రేమ, అభిమానాలే నా బలం. అందుకే ఈ విషయాన్ని తప్పకుండా షేర్ చేయాలని అనుకున్నాను. సోషల్ మీడియాలో ఇదే నా చివరి పోస్ట్. ఇక మీదట నా సినిమా అప్డేట్స్తో పాటు మిగతా విషయాలను నా టీమ్ అప్డేట్ చేస్తుంది అని వరీనా పేర్కొంది. ప్రస్తుతం ఆమె ‘పోస్టర్’, ‘ఇన్కంప్లీట్ మ్యాన్’ సినిమాల్లో నటిస్తోంది. కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రంలోను స్పెషల్ సాంగ్ చేయనుందని సమాచారం.