‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిభావంతులైన ఎంతో మంది కళాకారులకు సినీ రంగంలో అవకాశాలు దొరుకుతున్నాయి. కొత్త టాలెంట్ను ప్రోత్సహిస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది’ అని అన్నారు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ‘కార్తిక్స్ ది కిల్లర్’ ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్తిక్సాయి, డాలీషా, నేహాదేశ్పాండే నాయకానాయికలుగా నటిస్తున్నారు. చిన్నా దర్శకుడు. ఆవుల రాజుయాదవ్, సంకినేని వాసుదేవరావు నిర్మాతలు. చిత్ర ట్రైలర్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘కుటుంబమంతా కలిసి చూసే చక్కటి సందేశాత్మక చిత్రాల్ని రూపొందించే సంస్కృతి పెరగాలి’ అని తెలిపారు.