మేడ్చల్ : జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని, అందుకు అందరం పాటు పడాల్సిన అవసరం ఉందని ముఖ్య అటవీ సంరక్షణ శాఖ అధికారి (పీసీసీఎఫ్) శోభ అన్నారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయ పరిధిలో జాతీయ రహదారి పక్కన ఆక్సిజన్ పార్కులో ప్రపంచ అటవీ సంరక్షణ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు పీసీసీఎఫ్ ఏకే సింఘాల్, వినయ్కుమార్ మాట్లాడారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ నేషనల్ పార్కులో అటవీశాఖ అధికారులు, వాకర్లు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ పీసీసీఎఫ్ శోభ, డీఎఫ్వో జోజితో పాటు వాకర్లు ఉత్సాహంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు కుప్పురాం తదితరులు పాల్గొన్నారు.
పాముల ప్రదర్శన
అటవీ సంరక్షణ దినోత్సవ కార్యక్రమా ల్లో భాగంగా పార్కులో పాములు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ ఆఫ్ సొసై టీ, స్నేక్స్ సొసైటీ వివిధ రకాల పాముల గురించి వివరించారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు అవినాశ్, చంద్రశేఖర్, ఆదిత్య పాములను ప్రదర్శిస్తూ రకాలు, వాటి లక్షణాలను వివరించారు. కొన్ని పాములు చెట్లపై, మరికొన్ని నీటిలో, కొన్ని నేలపై నివసిస్తాయని తెలిపారు. ప్రస్తుతం 300 రకాల పాము జాతులు ఉండగా, అందులో 67 మాత్రమే విషపూరితం అన్నారు. అందులో 21 సముద్ర పాత్రంలో నివసిస్తాయని తెలిపారు. మిగితా 46 రకాల్లో 42 చాలా అరుదుగా కన్పిస్తాయన్నారు. నాలుగు మాత్రమే విషపూరితమైన పాములని తెలిపారు. వాటి తో జాగ్రత్తగా ఉండాలన్నారు. ‘కట్ల పా ము, నాగుపాము, రక్త పింజర, చిన్న పిం జర’ విషపూర్తిమైనవన్నారు. పాము మనుషులను కాటు వేయాలనుకోదని, చాలా వరకు దూరంగా పారిపోతుందన్నారు. పాము తొక్కినప్పుడు, మరి దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే ఆత్మ రక్షణకు కాటువేస్తుందని తెలిపారు. చెడుగు, మట్టిపాము, రెండుమూతుల పాము రైతుమిత్ర పాములుగా వారు అభివర్ణించారు. ఇవి పంట పొలాలకు నష్టం చేసే ఎలుకలు, విషపూరిత పాములను తింటాయని తెలిపారు. పాము కాటు వేసినప్పుడు కట్టు కట్టడం, కోసి విషాన్ని పీల్చివేయడం లాంటి పను లు చేయరాదన్నారు. ఆందోళనకు గురికాకుండా గంటలోపు వైద్యుడి వద్దకు వెళ్లి, యాంటీవీనమ్ టీకా తీసుకోవాలని సూచించారు. అనంతరం అధికారులతో అటవీ కళాశాల విద్యార్థులతో కలిసి ఆక్సిజన్ పార్కులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అడిషనల్ సీసీఎఫ్ అక్బర్, డీసీఎఫ్ శ్రీలక్ష్మి, డీఎఫ్వోలు అశోక్ కుమార్, జోజి, వెంకటేశ్వర్లు, ఎఫ్ఆర్వోలు శ్రీదేవి, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మణ్, డిప్యూటీ ఆర్వో శ్రీనివాస్, ఎఫ్బీవోలు పాల్గొన్నారు.