“పాగల్’ కథ వినగానే చాలా కొత్తగా అనిపించింది. అందుకే ఈ ప్రాజెక్ట్లో పాలుపంచుకున్నా. సినిమా ప్రచారాన్ని మొత్తం విశ్వక్సేన్ తీసుకున్నాడు. నిర్మాతగా అతన్ని చూసి నేను బాగా ఇంప్రెస్ అయ్యాను’ అన్నారు ప్రముఖ నిర్మాణ దిల్రాజు. ఆయన సమర్పణలో విశ్వక్సేన్ కథానాయకుడిగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పాగల్’. బెక్కెం వేణుగోపాల్ నిర్మాత. నివేదా పేతురాజ్, సిమ్రాన్చౌదరి కథానాయికలు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో విశ్వక్సేన్ మాట్లాడుతూ ‘ఎలాంటి లెక్కలు వేసుకోకుండా నిజాయితీగా ప్రేమించే ప్రేమ్ అనే యువకుడిగా నా పాత్ర సాగుతుంది. అతను తల్లి ప్రేమను అన్వేషిస్తూ చేసిన ప్రయాణమేమిటన్నదే ఈ సినిమా ఇతివృత్తం. ఈ సమయంలో థియేటర్లో సినిమా విడుదల చేయడం కరెక్టేనా అని చాలా మంది అడిగారు. నేను వాళ్లకు చెప్పేది ఒక్కటే.. సర్కస్లో సింహంతో ఎవరైనా ఆడుకుంటారు. కానీ నేను అడవికి వెళ్లి ఆడుకునే టైపు. మూసి ఉన్న థియేటర్లను కూడా ఈ సినిమాతో ఓపెన్ చేసి చూపిస్తా. తప్పైతే నా పేరు మార్చుకుంటా’ అన్నారు. దిల్రాజు ఇచ్చిన ధైర్యంతోనే రిస్క్ అని తెలిసినా సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తున్నామని, అందరూ గర్వపడే సినిమా చేశామని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెలిపారు. విశ్వక్సేన్ కెరీర్లోనే పెద్ద హిట్గా నిలుస్తుందనే నమ్మకం ఉందని, దిల్రాజుగారి ఎంట్రీతో సినిమాకు మరింత హైప్ వచ్చిందని దర్శకుడు నరేష్ కుప్పిలి పేర్కొన్నారు. ఈ వేడుకలో యువహీరోలు కార్తికేయ, తేజ సజ్జా, శ్రీవిష్ణు పాల్గొన్నారు.