విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గురువారం చెన్నైలో ప్రారంభమైంది. టి.పి.శర్వానంద్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తోంది. యువన్శంకర్ రాజా స్వరకర్త. విశాల్ నటిస్తున్న 31వ చిత్రమిది. యాక్షన్ ఎంటర్టైనర్గా, వినూత్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని..విశాల్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రాన్ని రెండు నెలల్లోనే పూర్తి చేసి ఆగస్ట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.