Vishal | కోలీవుడ్ స్టార్ విశాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘పందెంకోడి’ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ను సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఈయన తన సినిమాలకు తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం, ఇంటర్వ్యూలలో కూడా తెలుగులోనే మాట్లాడటంతో టాలీవుడ్కు మరింత చేరువయ్యాడు. ఈయన నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. ఇటీవలే ‘సామాన్యుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్కు ఆశించిన స్థాయిలో ఈ చిత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం ఈయన నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో విశాల్ తన 33వ సినిమాను ప్రకటించాడు.
ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘మార్క్ ఆంటోని’ అనే టైటిల్ను ఖరారు చేశారు. తాజాగా ఈ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా షూటింగ్ ప్రారంభమైంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో విజయ్కు జోడీగా రీతూ వర్మ హీరోయిన్గా నటించనుంది. దర్శకుడు,నటుడు ఎస్.జే సూర్య ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నాడు. జీవి ప్రకాష్కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మినీ స్టూడీయోస్ పతాకంపై ఎస్.వినోద్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఇక విశాల్ నటించిన ‘లాఠీ’ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనితో పాటుగా ‘డిటెక్టీవ్ పార్ట్-2’ చిత్రంలో నటించడంతో పాటు దర్శకత్వం వహించాడు.
#MarkAntony Shoot Started Today With a Formal Pooja🌟
Stars : Vishal – SJSuryah
Music : GV Prakash 🎵
Direction : Adhik (TIN)🔥Happy For You @vinod_offl Sir🙌🏼
Shoot On Big Set at Chennai💥 pic.twitter.com/t8vxfxdfwc— Saloon Kada Shanmugam (@saloon_kada) May 5, 2022