తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న యువ నటుడు.కెరీర్లో 30 సినిమాలలో నటించిన విశాల్ వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులని అలరించాడు. ప్రస్తుతం తన 31వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. “నాట్ ఏ కామన్ మ్యాన్” అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్ని నేడు విశాల్ బర్త్ డే సందర్భంగా రివీల్ చేశారు మేకర్స్.సామాన్యుడు అనే టైటిల్తో తెలుగులో ఈ మూవీ విడుదల కానుందని తెలియజేశారు.
పా శరవణన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈదు థెవైయో అధువే ధర్మం అనే షార్ట్ ఫిల్మ్ తో మంచి టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న శరవణన్ విశాల్ 31వ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని విశాల్ ఫిలిం ఫ్యాక్టరి బేనర్పై విశాల్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. ఓ సారి కరోనా వలన వాయిదా పడగా, మరోసారి విశాల్కి అయిన గాయం వలన ఆగింది. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్లో విశాల్ గాయపడ్డాడు. ఆ గాయం కారణంగా విశాల్ కు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఈ మూవీకి బ్రేక్ పడింది. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చినట్టు తెలుస్తుంది.
విశాల్ చివరగా చక్ర అంటూ అందరినీ పలకరించారు. ఇక ఎనిమీ అంటూ ఆర్య, విశాల్లు రాబోతోన్నారు. ఈ క్రేజీ కాంబోలో వస్తోన్న సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే వదిలిన టీజర్లు,పోస్టర్లు అదిరిపోయాయి.