తనిష్క్రెడ్డి, అంకితసాహూ జంటగా ఏవీ క్రియేటివ్ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. రిచా భట్నాగర్, విజయలక్ష్మి నిర్మాతలు. మాధవ్ మూర్తి దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి వెంకట్యాదవ్ క్లాప్నివ్వగా, జ్యోత్స కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా తనిష్క్రెడ్డి మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథా చిత్రమిది. వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కిస్తున్నాం. అక్టోబర్ చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు. తెలుగు తెరపై ఎవరూ స్పృశించని సరికొత్త పాయింట్తో సినిమాను రూపొందిస్తున్నామని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, సంగీతం: ఆర్ ఆర్ ధ్రువన్.