రవితేజ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం విక్రమార్కుడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ పోషించాడు. అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో రవితేజ నట విశ్వరూపం చూపించాడు. ఇందులో ‘జింతాతా జితా జితా .. ‘ అనే రవితేజ మేనరిజాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్కి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
2006 సంవత్సరం విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించిన ‘విక్రమార్కుడు’ కథకు మళ్లీ ఇంతకాలానికి సీక్వెల్ కథ రెడీ చేశారట రచయిత విజయేంద్ర ప్రసాద్. ఈ సీక్వల్కి రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశాలు లేవని అంటున్నారు. రాజమౌళి రానున్న రోజులలో వేరే హీరోల సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ కథను వేరే దర్శకుడికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
రాజమౌళి తరువాత తెలుగులో ఈ తరహా మాస్ యాక్షన్ సినిమాలు తెరకెక్కించడంలో వినాయక్ .. పూరి సిద్ధహస్తులు. ఇక ఇదే కంటెంట్ ను కాస్త స్టైలిష్ గా తెరకెక్కించాలంటే సురేందర్ రెడ్డి వల్లనే అవుతుంది. ఈ ముగ్గురిలోఒకరు విక్రమార్కుడు సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. విక్రమార్కుడు చిత్రంలో అనుష్క కథానాయికగా నటించగా, సీక్వెల్కి కూడా ఆమె డేట్స్ ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది.