ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలు పుట్టిస్తుంది. రోజురోజుకు కరోనా భారీగా పెరుగుతూ పోతున్న నేపథ్యంలో ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే కరోనా బారిన పడి ఎంతో మంది తనువు చాలించారు. ఇందులో సినీ ప్రముఖులు ఉన్నారు. అయితే కోవిడ్ నుండి ప్రజలను రక్షించేందుకు సినీ సెలబ్రిటీలు తమ వంతు విరాళాలు అందిస్తున్నారు. తాజాగా చియాన్ విక్రమ్ ఆన్లైన్ ద్వారా తమిళనాడు ప్రభుత్వ నిధికి 30 లక్షల రూపాయలు పంపించారు. భారీ మొత్తంలో విక్రమ్ విరాళాలు అందించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తమిళ నాట పెరుగుతున్న కోవిడ్ ప్రభావం నిమిత్తం అనేకమంది సినీ తారలు తమిళనాడు ప్రభుత్వ నిధికి భారీ మొత్తంలో విరాళాలు అందించారు. ఇప్పటికే సూర్య, కార్తీ సోదరులు కోటి విరాళం అందించగా, మురుగదాస్ రూ. 25 లక్షలు, అజిత్ 25 లక్షలు, సౌందర్య రజనీకాంత్ భర్త విశాగణ్ కోటి రూపాయలు , దర్శకుడు వెట్రిమారన్ ,రూ.10 లక్షలు, ఎడిటర్ మోహన్, ఆయన తనయుడు మోహన్ రాజా, జయం రవి రూ. 10 లక్షల రూపాయలు, తమిళ నటుడు శివ కార్తికేయన్ విరాళం కింద పాతిక లక్షలు, శంకర్ రూ. 10 లక్షల రూపాయలు అందించారు. ఈ రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని కలిసి రూ.50 లక్షల రూపాయలు విరాళం అందించారు.