అమరావతి : కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఆత్రేయపురం మండలం వసంతవాడ తీర్థానికి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు కారు లొల్ల లాకుల వద్ద కాలువలోకి దూసుకు వెళ్లింది. ఒకరి మృతదేహం లభ్యమవగా.. మరో ముగ్గరు గల్లంతైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కారులో ఉన్నవారి వివరాలు తెలియరాలేదు. ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.