Vijaydevarakonda-samantha | విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. ‘మజిలి’ ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన టైటిల్ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఖుషి సినిమా టైటిల్ను ఈ చిత్రానికి పెట్టడంతో ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. లేటెస్ట్గానే ఈ చిత్రం కాశ్మీర్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్నట్లు శివ నిర్వాణ సోషల్ మీడియాలో ప్రకటించాడు. దాదాపు 20రోజుల పాటు ఈ ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. ఈ షెడ్యూల్లో విజయ్, సమంత, వెన్నెల కిషోర్, శరణ్యలపై సన్నివేశాలను తెరకెక్కించారు.
అయితే ఈ సినిమా షూటింగ్లో విజయ్, సమంతలకు గాయాలయ్యాయని.. కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు వీరిద్దరు లిడ్డర్ నదిలో పడిపోయారని, దాంతో వీరికి స్వల్ప గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ‘ఖుషి’ పీఆర్ టీం స్పందించి ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవంలేదని, టీం అంతా కాశ్మీర్లో ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని నిన్ననే హైదరాబాద్కు తిరిగి వచ్చారని.. ఎలాంటి పుకార్లను నమ్మోద్దూ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా రెండో షెడ్యూల్ జూన్లో ప్రారంభంకానుంది. ఈ చిత్రంలో విజయ్ ఆర్మీ అధికారిగా కనిపించనున్నట్లు టాక్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 23న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Fake news alert :"There are few reports that #VijayDeverakonda and #Samantha were injured while shooting for #Kushi movie.There is no truth in this news.
The entire team returned to Hyd yesterday after successfully completing 30 days of shooting in Kashmir.Dont believe such news"— BA Raju's Team (@baraju_SuperHit) May 24, 2022