సుల్తాన్బజార్,జూన్ 1: చేతిపంపు వద్ద స్నానం చేయవద్దన్నందుకు యాచకుడిని మరో యాచకుడు చంపేశాడు. ఈ సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట్ మండలం, జలాల్పూర్ గ్రామానికి చెందిన ముక్తల పురుషోత్తంరెడ్డి(35) చాదర్ఘాట్ సాయిబాబా టెంపుల్ ఫుట్పాత్పై ఉంటూ యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు. కాగా.. అదే ఫుట్పాత్పై నివసించే నేపాల్కు చెందిన బహదూర్ మంగళవారం పబ్లిక్ బోరు వద్ద స్నానం చేస్తున్నాడు. గమనించిన పురుషోత్తంరెడ్డి ఇక్కడ స్నానం చేయవద్దని అతడిని వారించాడు.. కోపోద్రిక్తుడైన బహదూర్ రోకలిబండతో పురోషోత్తంరెడ్డి తలపై దాడి చేయగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.