తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యారు. ఇటీవలి కాలంలో ఆయన సైరా, ఉప్పెన చిత్రాలలో నటించి అలరించాడు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న విక్రమ్ సినిమాలోను విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. విలక్షణ నటనతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఇప్పుడు హోస్ట్గా మారారు.
మాస్టర్ చెఫ్ అనే కార్యక్రమానికి విజయ్ సేతుపతి హోస్ట్గా ఉండగా, తాజాగా ప్రోగ్రామ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ లాంచింగ్ కార్యక్రమంలో అనేక విషయాలు తెలియజేశారు. చెన్నైలో చదువుకుంటున్న సమయంలో కాలేజ్ పూర్తయ్యాక రాత్రి ఏడు గంటల నుండి అర్ధరాత్రి 12.30ని.ల వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేసే వాడిని. రాత్రి భోజనం కూడా అక్కడే. డబ్బులు రావడంతో పాటు ఆకలి కూడా తీరుతున్న నేపథ్యంలో చాలా కాలం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేశాను.
ప్రతి నెల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేసినందుకు రూ. 750 జీతం ఇచ్చే వాళ్లు. టెలిఫోన్ బూత్లోను ఓ మూడు నెలలు పని చేశాను. అంటూ పాత రోజులు గుర్తు చేసుకున్నారు. ఉల్లి సమోసా అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పిన విజయ్ సేతుపతి ఇప్పుడు బయట దొరకక పోవడంతో తానే ఇంట్లో ఉల్తి సమోసా చేసుకొని, ఒక కప్పు టీ తాగుతానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్న విజయ్ అప్పుడు అంత తక్కువ జీతానికి కూడా పని చేశాడా అని అందరు ఆశ్చర్యపోతున్నారు.