మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి తెలుగులో కూడా అద్భుతమైన ఇమేజ్ వుంది. ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. దాంతో ఇప్పుడు విజయ్ సినిమాలు తెలుగులోనూ విడుదల అవుతున్నాయి. తాజాగా ఆయన నటిస్తున్న లాభం సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సమయంలో ఈ సినిమా దర్శకుడు ఎస్పీ జననాథన్ గుండెపోటుతో మరణించడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన చివరి సినిమాపై అంచనాల కంటే కూడా ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి.
వైవిధ్య సినిమాల దర్శకుడిగా పేరొందిన ఎస్పీ జననాథన్ లాభం సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా అప్పటివరకు ఎడిటింగ్ రూమ్లో ఉన్న ఈయన.. ఇంటికి వెళ్లిన తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఎంతసేపటికి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చిత్ర యూనిట్ ఇంటికి వెళ్లి చూసేసరికి నిర్జీవంగా పడి ఉన్నాడు. జననాథన్ మరణం అప్పట్లో తమిళ సినీ ఇండస్ట్రీలో సంచలంగా మారింది. ఇప్పుడు ఈయన చివరి చిత్రం అయిన లాభం సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటించడమే కాకుండా నిర్మించాడు కూడా. విజయ్ సేతుపతితో 2015లో పురంపొక్కు ఎంగిర పొదువుడమై సినిమా తెరకెక్కించాడు జననాథన్. లాభం వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి జననాథన్ ప్రాణాలతో లేకపోవడంతో విజయ్ సేతుపతి చాలా ఫీలవుతున్నాడు. అందుకే ఈ సినిమాతో ఆయనకు భారీ నివాళి ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలో సినిమాను భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
పొలిటికల్ డ్రామాగా వస్తున్న లాభం సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా శృతిహాసన్ నటించింది. ఈ సినిమాలో సాయి ధన్సిక, కలైయరసన్, పృథివీ రాజన్, రమేష్ తిలక్, డానియల్ అన్నె పోప్, నితీష్ వీర, జై వర్మన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Lady villains in Tollywood |గ్లామర్తోనే కాదు.. విలనిజంతోనూ మెప్పించిన అందాల బొమ్మలు !
Boyapati Sreenu | కేజీఎఫ్ హీరోకు బోయపాటి కథ వినిపించాడా..?
స్నేహితులతో బిజినెస్ మొదలు పెట్టిన కీర్తి సురేష్
దిశా పటానీ బీచ్వాక్.. ఇన్స్టాలో కొత్త వీడియో