హైదరాబాద్ : మిడ్వెస్ట్ ఎనర్జీతో ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సామాజిక అవసరాలను తీర్చడానికి, మల్టీడిసిప్లినరీ విద్య, పరిశోధనలను ప్రోత్సహించడం ఈ అవగాహన ఒప్పంద లక్ష్యం. మిడ్వెస్ట్ ఎనర్జీతో ఓయూ విద్యార్థులు, అధ్యాపకులకు ఇంటర్న్షిప్ అందించడం. ఓయూ ఇంఛార్జీ వీసీ అరవింద్ కుమార్ సమక్షంలో ఓయూ రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి, మిడ్వెస్ట్ ఎనర్జీకి చెందిన సోమ్య కుక్రేటి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇందుకు సంబంధించి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం. కుమార్, మిడ్వెస్ట్ టెక్నికల్ ప్రాజెక్ట్ హెడ్ స్టాన్లీ చార్లెస్ సంయుక్తంగా పత్రికా ప్రకటనను విడుదల చేశారు.