అసాంఘిక శక్తులపై నిఘా
ఏఎస్సీ కారే కిరణ్ ప్రభాకర్
కాలనీల్లో మోహరించిన బలగాలు
ఇంటింటా సోదాలు
వాహనాల పత్రాలు,ఆధార్ కార్డుల పరిశీలన
400 సీసీ కెమెరాల ఏర్పాటునకు చర్యలు
భైంసా,మార్చి 30: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సిద్దార్థ నగర్లో మంగళవారం ఏఏస్పీ కారే కిరణ్, సీఐ వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సాయంత్రం నుంచి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించారు. ఇంటింటికీ వెళ్లి సోదాలు చేశారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన ద్విచక్ర వాహన పత్రా లు, ఆధార్కార్డులను పరిశీలించారు. అనంతరం కాలనీవాసులతో మాట్లాడారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు సాగించే అవకాశం లేకుండా,గట్టి నిఘా పెట్టామని పేర్కొన్నారు. సుమారు 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇకపై ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. భైంసాలో 144 సెక్షన్ యథా విధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.