అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ ఇటీవల హైదరాబాద్ ‘టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్’గా అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. తనదైన విలక్షణ వ్యక్తిత్వం, ైస్టెల్తో ఆయన యువతరంలో తిరుగులేని ఫాలోయింగ్తో దూసుకుపోతున్నారు. తాజాగా ‘టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 50’ పేరుతో జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీలో విజయ్ దేవరకొండ రెండోస్థానాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది మూడోస్థానంలో ఉన్న ఆయన ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నారు. రణ్వీర్సింగ్, రణభీర్కపూర్ వంటి బాలీవుడ్ అగ్రనటుల్ని అధిగమించి విజయ్ దేవరకొండ రెండోస్థానంలో నిలవడం విశేషం. ఆన్లైన్ ఓటింగ్, జ్యూరీ అభిప్రాయాల ఆధారంగా వివిధ రంగాల నుంచి టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాను తయారు చేసింది టైమ్స్ గ్రూప్. జాతీయ స్థాయిలో జరిగిన ఈ ఆన్లైన్ ఓటింగ్లో దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్సింగ్ రాజ్పుత్ తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. ఆదిత్య రాయ్కపూర్, విక్కీకౌశల్, దుల్కర్సల్మాన్ తొలి ఐదుస్థానాల్లో ఉన్నారు. అర్జున్రెడ్డి, గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో దక్షిణాది యువతరానికి చేరువైన విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’లో నటిస్తున్నారు.