అమరావతి : సరదాగా స్నానం చేసేందుకు దిగి తెలుగు గంగ కాలువలో నీటమునిగి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూర్ జిల్లా బీఎన్ కండ్రిగ మండల కేంద్రంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మృతిచెందిన యువకులను అరవింద్ (18), రాజు (25), ప్రభుగా (30)గా గుర్తించారు. మృతదేహాలను పోలీసులు కాలువ నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.