యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటుడిగానే కాదు నిర్మాతగాను సత్తా చాటేందుకు కృషి చేస్తున్నాడు. కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ తొలిసారి ఈ బేనర్పై మీకు మాత్రమే చెప్తా అనే సినిమా చేశాడు. ఈ చిత్రంలో పెళ్లి చూపులు దర్శకుడు ప్రధాన పాత్ర పోషించాడు. ఇక ఇప్పుడు తన ప్రొడక్షన్లో రెండో చిత్రంగా పుష్పక విమానం అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
ఇక తన బేనర్లో మూడో చిత్రంగా నూతన దర్శకుడు పృథ్వీ సేనా రెడ్డితో ఓ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం మేకర్స్ నటీనటుల ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుంది. ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రూపొందనుంది.