టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ.. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన విజయ్.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెడుతూ రెండు చేతులు బాగా సంపాదిస్తున్నాడు. తాజాగా విజయ్ తన స్వస్థలం మహబూబ్ నగర్ లో విజయ దేవరకొండ మల్టీ ప్లెక్స్ నిర్మించారు.
ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో విజయ్ నిర్మించిన థియేటర్కి ‘ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్’ (ఏవీడీ) అనే పేరు పెట్టారు. రీసెంట్గా ఈ థియేటర్ని ప్రారంభించగా, నేటి నుండి ఈ థియేటర్లో లవ్ స్టోరీ సినిమా ప్రదర్శితం కానుంది. రాష్ట్రంలోని ఏ థియేటర్లకు లేని ఫీచర్లు సవలతులు ఈ ధియేటర్ కి ఉన్నట్లు తెలుస్తుంది. మంచి స్క్రీన్ తో పాటు సీటింగ్ కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందట. దేశంలోనే వినూత్నమైన ఖరీదైన తెరను ఈ మల్టీప్లెక్స్ థియేటర్ కలిగి ఉంటుందట.
అయితే ఈ రోజు తన తల్లి బర్త్ డే కావడంతో ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ..ఈ థియేటర్ నీ కోసమే అని తెలిపాడు విజయ్ దేవరకొండ. నీ కోసం మరింత కష్టపడి ఎన్నో మెమోరీస్ అందిస్తారు అని విజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం లైగర్ చిత్ర షూటింగ్లోబిజీగా ఉన్నాడు విజయ్. గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మరి కొద్ది రోజులలో చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది.