అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ సోషల్మీడియా వేదికల్లో తిరుగులేని అభిమానగణంతో దూసుకుపోతున్నారు. తనదైన విలక్షణ వ్యక్తిత్వం, ైసూటిగా భావాల్ని వ్యక్తపరిచే నైజం, ైస్టెల్తో ఆయన యువతరంలో మంచి ఫాలోయింగ్ను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో కోటి ఇరవై ఐదులక్షల ఫాలోవర్స్తో దక్షిణాది హీరోల్లో అగ్రస్థానంలో నిలిచిన విజయ్దేవరకొండ తాజాగా ఫేస్బుక్లో కోటి మంది ఫాలోవర్స్ను సంపాదించుకొని సత్తా చాటారు. ‘అర్జున్రెడ్డి’ ‘గీతగోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలతో దక్షిణాదిన అగ్ర హీరోల్లో ఒకరిగా ఎదిగిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’లో నటిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.